Radhika Sarathkumar : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి రాధిక:ప్రముఖ నటి రాధికా శరత్కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.
ప్రముఖ నటి రాధికా శరత్కుమార్కు డెంగ్యూ
ప్రముఖ నటి రాధికా శరత్కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 5వ తేదీ వరకు ఆమెకు వైద్యం అవసరమని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలతో పాటు సీరియల్స్లో నటించి రాధిక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా, విజయవంతమైన టీవీ సీరియల్స్కు నిర్మాతగానూ ఆమె ప్రసిద్ధి చెందారు. రాజకీయాల్లో కూడా రాణించిన రాధిక, తెలుగులో అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి 15కి పైగా చిత్రాల్లో నటించారు.
Read also:China : రష్యాపై ఆంక్షలు విధించే ముందు మీ దేశాన్ని చూసుకోండి: అమెరికాపై చైనా ఫైర్
